జాన్వీనే హైలెట్

జాన్వీ కపూర్ కి యూత్ లో బాగా ఫాలోయింగ్ ఉంది. ఆమె నటించిన బాలీవుడ్ చిత్రాలేవీ సంచలన విజయాలు సాధించలేదు. కానీ, పాపులారిటీ మాత్రం సంపాదించుకొంది. అందుకే, ఆమె తెలుగు సినిమా ఎంట్రీకి అంత క్రేజ్ వచ్చింది.

ఈ రోజు మొదలైన ఎన్టీఆర్ 30వ సినిమా ప్రారంభోత్సవానికి ఆమె హాజరైంది.

ఎన్టీఆర్ సినిమా లాంచ్ కి రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి టాప్ డైరెక్టర్లు వచ్చారు. కానీ అందరి చూపులు మాత్రం జాన్వీ కపూర్ పైనే. ఈ అందెగత్తె అడుగుపెట్టగానే అక్కడి సీను మొత్తం మారింది. కెమెరాలన్నీ ఆమె వైపే తిరిగాయి.

ఈ సినిమాతో ఆమె హవా తెలుగులో మొదలవుతుంది. ఇది కనుక పెద్ద హిట్ అయితే జాన్వీ కపూర్ ఇక పెద్ద హీరోలకు రెగ్యులర్ హీరోయిన్ అవుతుంది. ఇప్పటికే పూజ హెగ్డే వంటి టాప్ హీరోయిన్ల హవా తగ్గింది. సో, జాన్వీ షైన్ ఐతే ఆమెకి ఇక్కడ తిరుగుండదు.

Advertisement
 

More

Related Stories