ముంబయికి మారిన లక్ష్మీ మకాం!

నటి మంచు లక్ష్మీ ప్రసన్న ఇక హైదరాబాద్ కి టాటా బై బై చెప్పింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఆశలు వదులుకొంది. ఇక తన అదృష్టాన్ని బాలీవుడ్ లో పరీక్షించుకోవాలనుకుంటోంది. అందుకే, ముంబైకి తన మకాం మార్చింది.

‘‘కొత్త నగరం.. కొత్త దశ.. ఎంతో ఆనందంగా ఉంది ఈ లైఫ్. నాకెప్పుడూ అండగా ఉంటోన్న అభిమానులకు ధన్యవాదాలు. #ముంబై ,” అని ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఎకైక తెలుగు చిత్రం.. “అగ్ని నక్షత్రం”. ఇది తప్ప ఇంకో సినిమా లేదు. తెలుగులో వెబ్ సిరీస్ లు కూడా దక్కడం లేదు. దాంతో 46 ఏళ్ల ఈ భామ తన మిత్రురాళ్ల సాయంతో ముంబైలో హిందీ సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో అవకాశాలు పొందాలని భావిస్తోంది.

రకుల్ ప్రీత్ సింగ్, తాప్సి పన్ను వంటి బాలీవుడ్ భామలు ఆమెకి ఫ్రెండ్స్. వాళ్ళు అక్కడ మంచి పొజిషన్ లో సెటిల్ అయ్యారు. సో, లక్ష్మీ ప్రసన్న కూడా అక్కడ అవకాశాలు వెతుక్కుంటూ ముంబైకి మకాం మార్చింది.

Advertisement
 

More

Related Stories