కిలిమంజారో ఎక్కిన నివేథా థామస్

కిలిమంజారో అన్న పేరు విన్నారా? ప్రపంచంలో ఎత్తైన పర్వతాల్లో ఒకటి. ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలో ఉన్న ఈ పర్వతం ఇతర పర్వత శ్రేణులతో సంబంధంలేని అత్యంత ఎత్తైనది. ఒక అగ్నిపర్వతం. దీని శిఖరం చేరాలంటే చాలా కష్టం. కానీ కిలిమంజారో పైకి అధిరోహించింది హీరోయిన్ నివేదా థామస్‌.

Advertisement

కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి భారతదేశ జెండాని రెపరెపలాడించింది. తన భుజంపై మన దేశపు జెండాని కప్పుకొని కిలిమంజారోపై నిలుచున్న తన ఫోటీని సోషల్‌ మీడియాలో షేర్ చేసింది. నివేదా థామస్‌ కి ట్రెక్కింగ్ అంటే ఇష్టమంట. ఆ విషయాన్ని ఇప్పుడు బయటపెట్టింది. కొన్ని నెలల పాటు శిక్షణ తీసుకుంది. లక్ష్యం నెరవేరింది అని ఆనందంగా ఉంది.

ఇంతకుముందు హిమాలయ పర్వతాల్లో ట్రెక్కింగ్ చేసింది.

25 ఏళ్ల ఈ భామ కథ నచ్చితేనే సినిమా చేస్తుంది. ఈ ఏడాది ‘వకీల్ సాబ్’లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఆమె కొరియన్ మూవీ ‘మిడ్నైట్ రన్నర్స్’ ఆధారంగా సుధీర్ వర్మ తీస్తున్న తెలుగు సినిమాలో నటిస్తోంది.

Advertisement
 

More

Related Stories