సుధీర్ కి కరోనా, క్వారంటైన్లోకి రష్మి

Rashmi and Sudheer

సుడిగాలి సుధీర్ కు కరోనా సోకిందని ఫిక్స్ అయిన వెంటనే అంతా రష్మి వైపు చూశారు. ఎందుకంటే.. ఈటీవీ డిజైన్ చేసిన ఓ ప్రొగ్రామ్ కోసం వీళ్లిద్దరూ కలిసి డాన్స్ చేశారు. ఇప్పుడా అనుమానాలే నిజమయ్యాయి. రష్మి కూడా హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయింది.

అయితే తనకు కరోనా పాజిటివ్ వచ్చిందా లేదా అనే విషయాన్ని రష్మి కన్ ఫర్మ్ చేయలేదు. తన షూటింగ్స్ మాత్రం పోస్ట్ పోన్ చేసుకుంది. ఆమె చేయాల్సిన “ఎక్స్ ట్రా జబర్దస్త్” షూట్ ను వారం రోజులు వాయిదా వేశారు. అప్పటికీ కుదరకపోతే నవంబర్ ఫస్ట్ వీక్ కు వాయిదా వేయడానికి సిద్ధంగా ఉన్నారు.

అటు ఈటీవీ ఛానెల్ లో రష్మి చేయాల్సిన ఓ కార్యక్రమాన్ని మాత్రం ఆపడం లేదు. ఆమె స్థానంలో తాత్కాలికంగా మరో సెలబ్రిటీని పెట్టి కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించారు.

అయితే ఇక్కడ సమస్య రష్మిది మాత్రమే కాదు. తాజా సమాచారం ప్రకారం హీరోయిన్ పూర్ణ, నటి సంగీత, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కూడా హోం క్వారంటైన్ లోకి వెళ్లినట్టు వార్తలొస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే.. ఈటీవీ, జీ తెలుగులో చాలా కార్యక్రమాలు ఆగిపోతాయి.

Advertisement
 

More

Related Stories