ఇక జోరు పెంచుతారట

సాయి ధరమ్ తేజ్ సినిమాలు తగ్గించాడు. ఆయన సోదరుడు ఐతే మొత్తానికే సినిమాలు మానేసినట్లు గ్యాప్ తీసుకున్నాడు. సాయి ధరమ్ తేజ్, అతని సోదరుడు వైష్ణవ్ తేజ్ ఇలా రేసులో వెనకబడడం, సినిమాలు తగ్గించడం వెనుక ఉన్న కారణాల గురించి చాలా పుకార్లు వచ్చాయి.
ఐతే సోదరులు ఇద్దరూ ఇప్పుడు కొత్త సినిమాలు ఒప్పుకొని జోరు పెంచుతారట.
సాయి ధరమ్ తేజ్ “విరూపాక్ష” తర్వాత జోరు తగ్గించాడు. పవన్ కళ్యాణ్ తో నటించిన “బ్రో” ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ఒప్పుకున్న “గాంజా శంకర్” ఆగిపోయింది. ప్రస్తుతం “సంబరాల యేటి గట్టు” అనే సినిమా రెండుళ్లుగా సాగుతోంది. ఈ సినిమా విడుదల తర్వాత స్పీడ్ పెంచుతాడట.
2026లో “రిపబ్లిక్ 2” అనే సినిమా చేస్తాడట. అలాగే ఒక కొత్త దర్శకుడు చెప్పిన లైన్ కూడా ఓకే చేశాడు. వచ్చే ఏడాది రెండు కొత్త సినిమాలు మొదలవుతాయి.
ఇక అతని తమ్ముడు వైష్ణవ్ తేజ్ వరుసగా ఫ్లాపులు తగలడంతో బెంబేలు ఎత్తిపోయి సినిమాలు ఆపేశాడు. “ఉప్పెన” సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు వైష్ణవ్. ఆ తర్వాత నటించిన “కొండపొలం”, “రంగ రంగ వైభవంగా”, “ఆదికేశవ” చిత్రాలు దారుణ పరాజయం చెందాయి. దాంతో రెండేళ్లుగా ఒక్క సినిమా చెయ్యలేదు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్, నాగబాబు సూచనతో కొత్తగా కెరీర్ రీస్టార్ట్ చెయ్యాలని భావిస్తున్నాడట.