ఈ భామకి ఒక్కసారిగా క్రేజ్

Tripti Dimri

“అర్జున్ రెడ్డి” సినిమాతో షాలిని పాండేకి హీరోయిన్ గా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు “యానిమల్” చిత్రంతో తృప్తి డిమ్రికి ఆ క్రేజ్ వచ్చింది. “యానిమల్” చిత్రంలో మెయిన్ హీరోయిన్ రష్మిక. రణబీర్ కపూర్ భారీగా నటించింది రష్మిక. ఆమెకి కొత్తగా గుర్తింపు అక్కర్లేదు. ఆమె ఇప్పటికే ఇండియాలో టాప్ హీరోయిన్లలో ఒకరు.

ఇక “యానిమల్”లో ఒక కీలక పాత్రలో రణబీర్ సరసన కనిపించిన తృప్తి డిమ్రి ఇప్పుడు అందరి దృష్టిలో పడింది.

తృప్తి డిమ్రి ఇప్పటికే అనేక వెబ్ సిరీస్ లలో నటించింది. కానీ అవేవి పాపులారిటీ తీసుకురాలేదు. కానీ ఈ 29 ఏళ్ల భామ “యానిమల్”లో చిన్న రొమాంటిక్ పాత్రతో క్రేజ్ తెచ్చుకుంది. రణబీర్, తృప్తి డిమ్రి మధ్య ఉన్న రొమాంటిక్ సీన్స్ కుర్రకారుకు, మాస్ ప్రేక్షకులకు తెగ నచ్చాయి.

సినిమా విడుదలతో ఒక్కసారిగా ఆమెకి క్రేజ్ పెరిగింది. ఇన్ స్టాగ్రామ్ లో అంతకుముందు 8 లక్షల మంది ఫాలోవర్స్ ఉండేవారు. ఇప్పుడు మిలియన్ దాటింది ఆ సంఖ్య. ఇక ఆమె అందచందాలకి ఫిదా అయింది యూత్. సో, ఆమెకి మరిన్ని పెద్ద ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.

Advertisement
 

More

Related Stories