త్రివిక్రమ్ కసరత్తు పూర్తి

Trivikram

దర్శకుడు త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబు హీరోగా తీయనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడే ప్రారంభం అయ్యేలా లేదు. ఎందుకంటే, మహేష్ బాబు ముందుగా ‘సర్కారు వారి పాట’ పూర్తి చెయ్యాలి. అంటే ఇంకో మూడు నెలల టైం ఆగాలి త్రివిక్రమ్. కానీ ఈ లోపు ఆయన ఆ సినిమా వర్క్ దాదాపు పూర్తి చేశారు

మరోవైపు, చాలా గ్యాప్ తర్వాత ఆయన మరో సినిమాకి మాటలు అందిస్తున్నారు. ఆ పని కూడా పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ , రానా హీరోలుగా ‘అయ్యపనం కోషియం’ రీమేక్ జరుగుతోంది. సాగర్ చంద్ర అనే యువ దర్శకుడు తీస్తున్న ఈ మూవీకి త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కోరిక మేరకు త్రివిక్రమ్ ఈ సినిమాకి డైలాగ్స్ రాశారు. ఈ సినిమా షూటింగ్ మళ్ళీ జులై 11న షురూ కానుంది.

ఇక త్రివిక్రమ్, మహేష్ బాబు సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడకన్ పనులు కూడా జరుగుతున్నాయి. హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని తీసుకోవాలనుకుంటున్నారు. జాన్వీ డేట్స్ ఇవ్వకపోతే పూజా హెగ్డేని కన్ఫర్మ్ చేస్తారు.

హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించే ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తాడు. వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదలయ్యే ఆవకాశం ఉంది.

Advertisement
 

More

Related Stories