పెళ్లి మండపాలకెళ్లి ప్రమోషన్!


సినిమా పబ్లిసిటీ రకరకాలు. సినిమా కథ, దాని థీమ్ ప్రకారం ప్రమోషన్లు చెయ్యడం అనే ట్రెండ్ మొదలైంది. ఈ వీకెండ్ విడుదల కానున్న ‘వరుడు కావలెను’ సినిమా పెళ్లి చుట్టూ తిరిగే కథ. దాంతో, హీరో నాగ శౌర్య, హీరోయిన్ రీతూ వర్మ హైదరాబాద్ లో జరుగుతున్న కొన్ని పెళ్లి వేడుకలకు వెళ్లి వధూవరులను సర్ప్రైజ్ చేశారు.

కోవిడ్ తర్వాతి పరిస్థితుల్లో సినిమా థియేటర్లకు జనాలని రప్పించడం కష్టం అయిపోతోంది. మొదటి వీకెండ్ కలెక్షన్లు కీలకం అయిపోయాయి. ఓపెనింగ్స్ రావడం అనేది అన్నటికన్నా ముఖ్యం. అందుకే హీరో, హీరోయిన్లు ఇలా చెయ్యాల్సి వస్తోంది.

సినిమా పెళ్లి థీమ్ తో సాగుతుంది కాబట్టి పెళ్లి మండపాలకు వెళ్లారు. అక్కడ ప్రమోషన్ చేస్తున్నారు. ఇక్కడివరకు ఓకే ఇంకొన్ని వేరే ఇబ్బందికరమైన థీమ్ తో కూడిన చిత్రాలకు ఏమి చేస్తారో?

‘వరుడు కావలెను’ సినిమాతో లక్ష్మీ సౌజన్య అనే కొత్త దర్శకురాలు పరిచయం అవుతున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తోంది.

Advertisement
 

More

Related Stories