
కెరీర్ లో ఎవరైనా ఒక పీరియడ్ సినిమా చేస్తారు, లేదంటే 2 చేస్తారు. కానీ కెరీర్ ప్రారంభించినప్పట్నుంచి వరుసగా అవే సినిమాలు చేస్తే ఎలా ఉంటుంది? కాకతాళీయమే అయినప్పటికీ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే పరిస్థితి ఇదే.
కెరీర్ మొదటి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ నుంచి తాజా చిత్రం ‘లెనిన్’ వరకు భాగ్యశ్రీ చేసిన సినిమాలన్నీ పీరియాడిక్ కథలే. అంతేకాదు, తమిళనాట ప్రస్తుతం శివకార్తికేయన్ హీరోగా భాగ్యశ్రీ చేస్తున్న సినిమా కూడా పీరియడ్ కథతోనే తెరకెక్కుతోంది.
అందుకే ఇప్పుడామె పీరియాడిక్ హీరోయిన్ అయింది. మరోవైపు తన బ్యాక్ గ్రౌండ్ బయటపెట్టింది. నైజీరియా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో చెప్పుకొచ్చింది.
“నేను ఔరంగాబాద్ లోనే పుట్టాను. అక్కడే పెరిగాను. నాన్నకు అనుకోకుండా నైజీరియాలో జాబ్ వచ్చింది. నాన్న లేకుండానే నాలుగేళ్లు మేం ఔరంగాబాద్ లోనే ఉన్నాం. ఆ తర్వాత నా 8వ తరగతికి నేను ఎబ్రాడ్ వెళ్లాను. అప్పట్నుంచి అక్కడే ఉన్నాను.”
నైజీరియాలో చాలా పెద్ద సినిమా ఇండస్ట్రీ ఉందని… మరీ ముఖ్యంగా నైజీరియన్లు ఇండియన్ సినిమాల్ని పిచ్చిపిచ్చిగా ఇష్టపడతారని చెబుతోంది భాగ్యశ్రీ.
