అల్లు అర్జున్ ఇప్పటికే నార్త్ ఇండియా మార్కెట్ ని క్యాప్చర్ చేశారు. రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చెయ్యకుండా హిందీ మార్కెట్ ని కొల్లగొట్టి పాన్ ఇండియా హీరోగా ఎదిగిన మొదటి తెలుగు హీరో అల్లు అర్జున్. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు కేవలం రాజమౌళి సినిమాల వల్లే మార్కెట్ పెరిగింది. కానీ అల్లు అర్జున్ తన ప్లానింగ్ తో రాజమౌళి సినిమా చెయ్యకుండా సంపాదించుకున్నాడు. ఈ ముగ్గురి హీరోలకన్నా పెద్ద హిట్ కొట్టాడు హిందీలో “పుష్ప 2″తో.
ఇక ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ కి రాజమౌళి సినిమాల వల్లే జపాన్ లో ఎంతోకొంత క్రేజ్, మార్కెట్ ఉంది. దాన్ని వాళ్ళు ఇంకా ఎక్కువ పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఫోకస్ పెట్టి పెట్టాడు. తాజాగా “పుష్ప 2” జపాన్ లో విడుదలైంది. ఈ రోజు నుంచి అక్కడ థియేటర్లలో రన్ అవుతోంది.
అల్లు అర్జున్ అక్కడికి వెళ్లి పబ్లిసిటీ మొదలుపెట్టాడు. హీరోయిన్ రశ్మికతో కలిసి అక్కడ ప్రచారం చేస్తున్నాడు. జపాన్ లో కూడా తనకి సొంతంగా మార్కెట్ సృష్టించుకునే ప్లానింగ్ మొదలుపెట్టాడు.
అల్లు అర్జున్ కి ఇప్పటికే ఇండియాలో తెలుగు రాష్ట్రాలు కాకుండా, హిందీలో, మలయాళంలో మంచి క్రేజ్ ఉంది. ఇక ఇద్దరు తమిళ దర్శకులతో తన తదుపరి చిత్రాలు చేస్తున్నాడు. వారి వల్ల తమిళ మార్కెట్ కూడా క్యాప్చర్ చేసుకునేవిధంగా లెక్కలు వేశారు.
ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. అది షూటింగ్ లో ఉండగానే లోకేష్ కనకరాజ్తో సినిమాను ప్రకటించాడు. ఇలా కొత్త మార్కెట్ లపై ఫోకస్ నిలిపాడు అల్లు అర్జున్.
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం "సింగ్ గీతం"…
పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నేరుగా…
హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మరో డిఫరెంట్ రోల్ లోకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పోలీస్…
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గత కొన్నేళ్లుగా కేరళలో కన్నా హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నాడు. తాను నటించే మలయాళ…
జాన్వీ కపూర్ (Janhvi Kapoor)ని "పెద్ది" సినిమాలో చూపించిన విధానం, ఆమె పాత్ర చిత్రీకరణ విషయంలో రేగిన గోల నేపథ్యంలో…
అందాల నిధి (Nidhhi Agerwal)కి పేరుకు తగ్గట్టుగానే అందాల గని ఉంది. కానీ ఆమెకు ఆవగింజంత అదృష్టం కూడా లేదు.…