ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఆమె ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ అయింది.
75 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్న శృతిహాసన్ ఎకౌంట్ హ్యాక్ అయింది. ఎవరో అగంతకులు ఆమె ఎకౌంట్ ను హ్యాక్ చేసి, తమ క్రిప్టో కరెన్సీ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇనస్టాగ్రామ్ లో శృతిహాసన్ ప్రకటించింది.
తన ట్విట్టర్ ఎకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారని, దయచేసి ఎవ్వరూ తన ఎకౌంట్ తో ఇంటరాక్ట్ అవ్వొదని ఆమె విజ్ఞప్తి చేసింది. త్వరలోనే మళ్లీ ట్విట్టర్ ను తన ఆధీనంలోకి తీసుకుంటానని ఆమె తెలిపింది.
కొన్నేళ్ల కిందట కూడా ఇలానే శృతిహాసన్ ఎకౌంట్ హ్యాక్ అయింది. దాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఆమెకు 3 రోజులు పట్టింది.
మరోవైపు, శృతి హాసన్ తన కొత్త చిత్రం “కూలి” విడుదలకు ఎదురు చూస్తోంది. ఈ సినిమాలో ఆమె రజినీకాంత్ కూతురిగా నటించినట్లు టాక్.
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం "సింగ్ గీతం"…
పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నేరుగా…
హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మరో డిఫరెంట్ రోల్ లోకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పోలీస్…
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గత కొన్నేళ్లుగా కేరళలో కన్నా హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నాడు. తాను నటించే మలయాళ…
జాన్వీ కపూర్ (Janhvi Kapoor)ని "పెద్ది" సినిమాలో చూపించిన విధానం, ఆమె పాత్ర చిత్రీకరణ విషయంలో రేగిన గోల నేపథ్యంలో…
అందాల నిధి (Nidhhi Agerwal)కి పేరుకు తగ్గట్టుగానే అందాల గని ఉంది. కానీ ఆమెకు ఆవగింజంత అదృష్టం కూడా లేదు.…