త్రిప్తి డిమ్రి లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ప్రభాస్ సరసన నటిస్తోంది త్రిప్తి. “స్పిరిట్” సినిమాలో దీపిక చెయ్యాల్సిన పాత్ర ఆమెకి దక్కింది. భారీ పారితోషికంతో పాటు ఇతర డిమాండ్ల కారణంగా దీపికని తప్పించారు. దాంతో తన “యానిమల్” సినిమాలో రెండో హీరోయిన్ గా నటించిన త్రిప్తికి మెయిన్ హీరోయిన్ గా ఈ సినిమాలో అవకాశం ఇచ్చాడు సందీప్ రెడ్డి.
ఆమె పేరు ప్రకటించిన తర్వాత ఇన్ స్టాగ్రమ్ లో ఒక్కసారిగా ఫాలోవర్స్ పెరిగిపోయారు. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఆమెని ఫాలో అవడం మొదలుపెట్టారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే.
ప్రస్తుతం త్రిప్తికి 6.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్ స్టాగ్రామ్ లో. “స్పిరిట్” విడుదలయ్యేసరికి ఆమె ఎంత పెరుగుతారో చూడాలి. పెద్ద హీరోల సరసన నటిస్తే ఆటోమాటిక్ గా హీరోయిన్లకు పాపులారిటీ పెరుగుతుంది అనడానికి త్రిప్తి మరో ఉదాహరణ.
“యానిమల్” సినిమాకి ముందు ఆమె పారితోషికం 50 లక్షల లోపు. ఆ తర్వాత రెండు కోట్ల రూపాయలకు పెరిగింది ఆమె పారితోషికం. ఇప్పుడు 5 కోట్ల వరకు చేరింది అని టాక్.
రాజమౌళి తీస్తున్న భారీ చిత్రం "వారణాసి" (Varanasi)పై అంచనాలు మాములుగా లేవు. విడుదల టైంకి ఇంకా భారీగా ఉంటుంది హైప్.…
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుస సినిమాలను ప్రకటిస్తూ టాలీవుడ్లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. గతంలో తనకు 'వీరసింహారెడ్డి'…
ప్రభాస్ (Prabhas) ఒకేసారి రెండు, మూడు చిత్రాలను సెట్స్ పై ఉంచుతాడు. 'బాహుబలి 2' విడుదల తర్వాత ఇలా చేస్తూ…
నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే…
బాలీవుడ్కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…