‘గుంటూరు కారం’ సమస్యలు నిజమే!

- Advertisement -
Guntur Kaaram

హీరో మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ “గుంటూరు కారం”కి సంబందించిన అనేక విషయాల్లో విభేదిస్తున్నారు అని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కథ, కథనాలు, పాటలు విషయాల్లో మహేష్ బాబు సంతృప్తిగా లేడని కూడా వార్తలు వచ్చాయి. కానీ నిర్మాతలు మాత్రం అవన్నీ పుకార్లు అని కొట్టి పారేశారు. సంగీత దర్శకుడు తమన్ కూడా పెద్ద బిల్డప్ ఇచ్చి ట్వీట్లు వేశాడు.

కానీ ఇప్పుడు అవి పుకార్లు కాదు నిజమని తేలింది.

రేపు (ఆగస్టు 9) మహేష్ బాబు పుట్టిన రోజు. రేపు పోస్టర్ విడుదల చెయ్యాలా, పాట విడుదల చెయ్యాలో కూడా నిర్మాతలు తేల్చుకోలేకపోయారు ఇప్పటివరకు. దీన్ని బట్టి కన్ఫర్మ్ అయింది త్రివిక్రమ్, మహేష్ బాబు మధ్య సరైన అండర్ స్టాండింగ్ లేదనేది. త్రివిక్రమ్ మాట ఈ సినిమా విషయంలో చెల్లడం లేదు. మహేష్ బాబు అనేక విషయాల్లో గట్టిగా పట్టుబడుతున్నారు. అందుకే, ఆయన మాటిమాటికీ షూటింగ్ ఆపేసి విదేశాలకు వెళ్తున్నారు.

ఈ సినిమా కథని ఇప్పటికే మార్చేశారు. షూటింగ్ ని రెండు నెలలు ఆపేశారు. హీరోయిన్ పూజ హెగ్డేని తొలగించిన విషయం తెలిసిందే. అలాగే సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ తప్పుకున్నారు. ఇప్పుడు కొత్త కెమెరామెన్ కావాలి. అలాగే షూటింగ్ పక్కనపెట్టి రెండు వారాలుగా విదేశాల్లో ఉంటున్నారు మహేష్ బాబు.

ఇంత జరిగినా ఇంకా అంతా బాగానే ఉంది అని నిర్మాతలు అనలేరు. “గుంటూరు కారం” అనేక సమస్యలతో సతమతం అవుతోంది అనేది నిజం.

More

Related Stories