పిచ్చిపిచ్చిగా రాస్తున్నారంటోన్న హేమ

Hema

నటి హేమ మరోసారి యూట్యూబ్ ఛానెళ్లపై మండిపడ్డారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పిచ్చి పిచ్చి థంబ్ నెయిల్స్ తో సెలెబ్రిటీల పరువుకి భంగం కలిగేలా చేస్తున్నారు అని ఆమె అంటున్నారు. గతంలో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ కి వ్యతిరేకంగా ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మరోసారి కంప్లైంట్ ఇచ్చారు.

“మూడేళ్ల క్రితం జరిగిన నా పెళ్లి వేడుకలకు ఇప్పుడు అసభ్యంగా థంబ్ నెయిల్స్ పెట్టి ప్రసారం చేస్తున్నాయి కొన్ని ఛానెల్స్. అప్పుడు నా భర్తతో ఉన్న ఫొటోలు, వీడియోను ఇప్పుడు మరోసారి పోస్టు చేసి వాటికి అసభ్యకరంగా థంబ్ నెయిల్స్ జతచేశారు. మూడేళ్ల క్రితం మా పెళ్లి వేడుకల వీడియో అది. అప్పట్లో హుందాగానే అప్లోడ్ చేశారు. ఇప్పుడు అదే వీడియో నుంచి ఫోటోలు గ్రాబ్ చేసి వాటికి రాస్తున్న క్యాప్సన్లు నా మనోభావాలు దెబ్బతీశాయి,” అని ఆమె పేర్కొన్నారు.

ఇలాంటి యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్సైట్స్ పై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. అలాగే, కోట శ్రీనివాసరావు చనిపోయాడని ఎలా పుకారు లేపారో కూడా ఆమె పేర్కొన్నారు.

ఇలాంటి వాటికి అడ్డుకట్ట వెయ్యాలని హేమ అడుగుతున్నారు.

Advertisement
 

More

Related Stories