ఆర్నెళ్లు సినిమాలకు దూరం

- Advertisement -
Sai Dharam Tej

నిన్న సమంత. నేడు సాయి ధరమ్ తేజ్. ఇద్దరూ సినిమాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. సాయి ధరమ్ తేజ్ రెండేళ్ల క్రితం బైక్ యాక్సిడెంట్ కి గురయ్యాడు. నెలల కొద్దీ ఆసుపత్రిలోనే చికిత్స తీసుకొని బయటపడ్డాడు. ఆ తర్వాత “విరూపాక్ష” షూటింగ్ పూర్తి చేసి, భారీ విజయం అందుకున్నాడు. అలాగే తన మావయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి ‘బ్రో’ సినిమాలో నటించాడు.

ఆ సినిమా ఈ నెలాఖరున విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తర్వాత సినిమాలకు గ్యాప్ ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. యాక్సిడెంట్ నుంచి పూర్తిగా కోలుకున్నప్పటికకీ ఆయన మాటల్లో కొంత అస్పష్టత కనిపిస్తోంది. డైలాగ్స్ చెప్పడంలో ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నాడు. అందుకే మరోసారి మరో సర్జరీ చేయించుకోబోతున్నాడు.

ఆ తర్వాత ఫిట్ నెస్ కోసం ప్రయత్నిస్తాను అని స్పష్టం చేశాడు.

అందుకే సాయిధరమ్ తేజ్ కనీసం ఆరు నెలల గ్యాప్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. కెరీర్ కన్నా ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యంగా ఉంటేనే కెరీర్ ఉంటుంది కదా.

More

Related Stories