
ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శింఛుకున్నారు హీరోయిన్ నయనతార (Nayanthara), ఆమె భర్త విగ్నేష్ శివన్. రేపు ఆమె భర్త డైరెక్ట్ చేసిన “లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ” (LIK) తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించారు.
భర్త ఈ సినిమాకి డైరెక్టర్ కావడం, తాను సహ నిర్మాత కావడంతో నయనతార ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. అలాగే సినిమా విజయం కోసం దేవుణ్ణి వేడుకుంటున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం అందుకే.
నయనతార ఇంతకుముందు తానే హీరోయిన్ గా, సమంత మరో హీరోయిన్ గా ఒక సినిమా నిర్మించింది. ఐతే, ఈ సినిమా విజయం వీరికి ముఖ్యం. ప్రదీప్ రంగనాథన్ మంచి సక్సెస్ లో ఉన్నాడు. క్రేజ్ ఉంది అతనికి. కానీ ఈ సినిమా అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. అనేకసార్లు వాయిదాపడింది. ఏ మాత్రం క్రేజ్ తెచుకోలేకపోయింది. అందుకే, ఈ సినిమా సాఫీగా విడుదలై మంచి టాక్ తెచ్చుకోవాలని భార్యభర్తలు ఇద్దరూ ప్రార్థనలు చేస్తున్నారు.
తాను నటించిన సినిమాలను నయనతార ప్రమోట్ చెయ్యదు. నిర్మాతల కష్టాలను పట్టించుకోదు. కానీ తానే నిర్మాత కావడంతో ఇప్పుడు తిప్పలు పడుతోంది.
