బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి యాక్షన్ హీరోగా గుర్తింపు ఉంది. తెలుగులో ఎనిమిది సినిమాలు వరుసగా చేశాక హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని బాలీవుడ్ వెళ్ళాడు. “ఛత్రపతి” అనే సినిమా హిందీలో చేస్తే అది ఘోరమైన పరాజయం అయింది. దాంతో బాలీవుడ్ కెరీర్ వదిలేసి మళ్ళీ తెలుగులోకి వచ్చాడు.
తెలుగులో రాగానే వరుసగా సినిమాలు చేశాడు. అందులో ముందుగా ఒప్పుకున్న చిత్రం “భీమ్లా నాయక్” దర్శకుడు సాగర్ చంద్ర డైరెక్షన్లో “టైసన్ నాయుడు.” ఐతే, ఈ సినిమా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ముందుకు కదలడం లేదు. ఈ గ్యాప్ లో “భైరవం”, “హైందవ”, “కిష్కింధపుర” వంటి సినిమాలు ఒప్పుకున్నాడు. మొత్తంగా నాలుగు చిత్రాలు. ఇందులో “భైరవం” గత వీకెండ్ విడుదలైంది.
ఇక “హైందవ”, “కిష్కింధపుర”, “టైసన్ నాయుడు” చిత్రాలు విడుదల కావాలి. “భైరవం” ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మిగతా మూడు సినిమాలపైనే ఇక ఆశలు.
కథాబలం ఉన్న సినిమాలు చెయ్యడమే కాదు తన పాత్రకు దమ్ముండేలా చూసుకుంటేనే బెల్లంకొండ సాయికి హీరోగా కెరీర్ బాగుంటుంది.
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…
సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బ్రహ్మచారి జీవితానికి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇదే బాటలో తాజాగా…
నభా నటేష్ (Nabha Natesh) ఈ ఏడాది రెండు భారీ సినిమాలపై ఆశలు పెట్టుకొంది ఒకటి నాగబంధం (Nagabandham), మరోటి…
శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు అమ్మాయి. ఇప్పటికే తెలుగులో 'మ్యాడ్' చిత్రంలో నటించింది. తమిళంలో…
తెలుగులో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ ఉన్న భామ… రష్మిక మందాన (Rashmika Mandanna) మాత్రమే. బాలీవుడ్ లో 'యానిమల్',…
దర్శకుడు మారుతి (Maruthi) ఆ మధ్య తీసిన 'ది రాజా సాబ్' (The Raja Saab) సినిమా ఎంత ఘోరంగా…