కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిగా ఎక్కువ బిజీగా ఉండాలనుకుంటోంది. పెళ్లి అయిన తర్వాత ఒక ఆర్నెళ్ల పాటు ఆమెకి అవకాశాలు రాలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటున్నాయి. హీరోయిన్ గానూ, గెస్ట్ రోల్స్ పరంగానూ డిమాండ్ పెరిగింది.
హీరోయిన్ గా ఆమెకి తెలుగులో ఒక పెద్ద చిత్రం ఉంది. విజయ్ దేవరకొండ నటిస్తోన్న “రౌడీ జనార్దన్” చిత్రంలో ఆమె ప్రధాన కథానాయిక. ఇక తమిళంలో ఇటీవలే రెండు సినిమాలు ఒప్పుకొంది. సో, హీరోయిన్ గా ఆమెకి మంచి సినిమాలే ఉన్నాయి.
తెలుగులో తాజాగా సుమంత్ హీరోగా నటిస్తోన్న ఒక సినిమాలో అతిథి పాత్ర ఒప్పుకొంది. హిందీలో ఒక సినిమాలో అతిథి పాత్ర చేస్తోంది. అంటే రెండు చిత్రాల్లో రెండు గెస్ట్ రోల్స్.
ఇక వెబ్ సిరీస్ లు కూడా ఉన్నాయి. అక్క అనే వెబ్ సిరీస్ ఆమె పూర్తి చేసి కాలమే అయింది. అది విడుదల కావాలి. 2024 డిసెంబర్లో ఈ అమ్మడు తన ప్రియుడు ఆంటోనిని పెళ్లాడింది. పెళ్లి అయిన ఏడాది తర్వాత ఆమె బిజీగా మారింది. ముంబై, చెన్నై, హైదరాబాద్ చుట్టూ చక్కర్లు వేస్తోంది షూటింగ్ ల కోసం.
ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది…
'పెద్ది' (Peddi) సినిమా వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఇందులో హీరోయిన్ జాన్వి కపూర్ (Janhvi Kapoor)ను అక్కడక్కడ అభ్యంతరకరంగా…
ఒకే సినిమాతో హీరోకి, హీరోయిన్ కి విషమ పరీక్ష ఎదురుకావడం అరుదు. "లెనిన్" (Lenin) సినిమా విషయంలో అదే జరుగుతోంది.…
ఒకప్పుడు తన స్పెషల్ సాంగ్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్లతో కుర్రకారును ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్ (Mumait Khan), ఒకప్పుడు తన జీవితంలోని…
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం "సింగ్ గీతం"…
పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నేరుగా…