గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కిన మొదటి చిత్రం… ‘విశ్వం’. అక్టోబర్ 11న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ ఓ భాగంగా శ్రీను వైట్ల ముచ్చటించారు.
‘విశ్వం’ఎలా మొదలైంది?
గోపీచంద్, నేను ఎప్పటినుంచో సినిమా చేయాలనుకున్నాం. కథ నచ్చితే వెల్దామన్నాడు గోపీచంద్. రాసుకున్న కథ బాగా వచ్చాక మొదలుపెట్టాం. ఎమోషన్స్ తో కూడిన వినోదాత్మక చిత్రం చేయాలని డెప్త్ లోకి వెళ్ళి ఈ సినిమా చేశాను. యాక్షన్ తోపాటు హిలేరియస్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది.
పాప చుట్టూ కథ తిరుగుతుందా?
అవును. ఇందులో పాప పాత్ర కీలకం. కథకి, టైటిల్ కి సంబంధం ఉంది. కథ ప్రకారమే పెట్టాం. విశ్వంలో చాలా సీక్రెట్స్ వుంటాయి. అలాగే ఈ విశ్వంలో కూడా చాలా విషయాలుంటాయి.
‘విశ్వం’లో మెయిన్ థీమ్ ఏమిటి?
పదేళ్ళ నాడు హీరో తెలివితేటలతో ఏదైనా సాధించగలగడు అనే కథలు వచ్చాయి. ఈ సినిమా అలా వుండదు. బర్నింగ్ ఇష్యూ తీసుకుని దాన్ని ఎంటర్ టైన్ మెంట్ లో ఎలా చెప్పొచ్చో చేశాను. మేకింగ్ వైజ్ గా వినూత్నంగా వుంటుంది. నాకూ, గోపీకు చాలా ఫ్రెష్ సినిమా అవుతుంది.
‘వెంకీ’ సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ లా విశ్వంలో వున్నట్లుంది?
నేను ఇందులోనూ ట్రైన్ ఎపిసోడ్ కథకు అవసరం అని పెట్టాను. ముందు ఇలా అనుకున్నప్పుడు వెంకీతో కంపేర్ చేస్తారనిపించింది. కానీ దానికి దీనికి చాలా తేడా వుంటుంది. 30 నిముషాల పాటు వెన్నెల కిశోర్, గణేష్, నరేష్, కవిత, చమక్ చంద్ర, షకలక శంకర్ వీరందరితో టైన్ జర్నీ చాలా బాగుంటుంది.
కామెడీ టీవీల్లోనూ, సోషల్ మీడియాలోనూ వచ్చేసింది. మరి సినిమా చేసేటప్పుడు మీకు కష్టంగా అనిపించలేదా?
ఇప్పుడు ప్రేక్షకులు సందర్భానుసారంగా రాసుకుంటే ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకానీ సోషల్ మీడియాలో కంటెంట్ తీసుకోకూడదు. మనమే సన్నివేశాలు క్రియేట్ చేయాలి. కథలోనే కామెడీ వుండడం ఒకరకంగా టఫ్ అయినా కష్టపడి చేశాం.
మీ గత సినిమాల్లో వ్యంగ్యం ఎక్కువ. ఇందులో అలా ఉందా?
నా శైలి సెటైర్. ఢీ నుంచే మన సినిమాలో అటువంటి ప్లే స్టార్ట్ అయింది. అందుకే వెంకీ చిత్రం రిరిలీజ్ కు మంచి అప్లాజ్ వచ్చింది. విశ్వంలో హీరోయిజం, విలన్ పాత్రలు రియలిస్ట్ గా వుంటాయి. వారికి తోడు వెన్నెల కిశోర్, నరేష్, గణేష్, ప్రుధ్వీ వంటి పాత్రలు హైలైట్ గా వుంటాయి.
‘ఢీ’ సీక్వెల్ ఎప్పుడు?
శ్రీహరిగారిని రీప్లేస్ చేయడం కష్టం. అందుకే, అది మొదలు కాలేదు.
రష్మిక మందాన (Rashmika Mandanna) ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకొంది. హీరో విజయ్ దేవరకొండని ప్రేమించి పెళ్లాడింది. పెళ్ళికి…
మలయాళంలో పెద్ద హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). బాలీవుడ్ లో కూడా ఇంతకుముందు సినిమాలు…
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. ఐతే బీజేపీ - టీడీపీ స్కెచ్ లో…
నభా నటేశ్ (Nabha Natesh)కు తొలి కమర్షియల్ హిట్ ఇచ్చిన దర్శకుడు పూరి జగన్నాధ్. అలా హిట్టిచ్చాడు కాబట్టి అతడంటే…
మంచు విష్ణు (Manchu Vishnu) కెరీర్లో అతిపెద్ద చిత్రం… కన్నప్ప (Kannappa). భారీ వ్యయంతో తీసిన ఈ చిత్రం అతనికి…
నటి దియా మీర్జా (Dia Mirza) ఇటీవల చేసిన కొన్ని కామెంట్లు దుమారం రేపాయి. పితృస్వామ్యం (patriarchy) వల్లే పర్యావరణ…