
పెళ్లి వంటి ఒకప్పుడు బ్లాక్ బస్టర్ చిత్రాలు ఇచ్చిన వడ్డే నవీన్ (Vadde Naveen) మళ్ళీ హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన తాజా చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ (Transfer Trimurthulu)
కమల్ తేజ నార్ల ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్, రాశి సింగ్ జంటగా నటించారు. శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, దేవి ప్రసాద్, సూర్య, బాబా బాస్కర్, ప్రమోదిని, సాథ్విక్ రాజు, అంజలి ప్రియ, గాయత్రి చాగంటి తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు.
ఈ మూవీని జూన్ 19న విడుదల చేయనున్నారు. గురువారం నాడు మూవీ టీజర్ను రిలీజ్ చేశారు.
“మా నాన్న గారు చనిపోయిన తరువాత నేను నటిస్తున్న, నిర్మిస్తున్న మొదటి చిత్రమిది. నేను ఎప్పుడూ హైదరాబాద్లోనే ఉన్నాను. ఫ్యామిలీతోనే ఉంటున్నాను. నేను ఎక్కువగా బయట కనిపించను. కానీ నా గురించి మీడియా, అభిమానులు మాత్రం ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. అందుకు థాంక్స్. బ్రేక్ తీసుకున్నాను, వచ్చింది. నా వద్దకు వచ్చిన కథలు నచ్చలేదు, నచ్చిన కథలు నా వద్దకు రాలేదు. ఎన్నో కథలు విన్నాను. త్రిమూర్తులు పాత్ర గురించి మాత్రమే కమల్ చెప్పాడు. ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ అనే టైటిల్ కూడా చెప్పాడు. అయితే కథ, స్క్రిప్ట్ మీద ఏడాది పాటు ఇద్దరం వర్క్ చేశాం. కథ మొత్తం రెడీ అయ్యాక షూటింగ్కి వెళ్లాం. హై క్వాలిటీ స్టాండర్డ్లో ఉంటుంది. కంటెంట్ కూడా కొత్తగా ఉంటుంది.” అని అన్నారు నవీన్.
