
తృప్తి డిమ్రి (Tripti Dimri)కి క్రేజ్ పెరుగుతోంది. సందీప్ వంగా తీసిన “యానిమల్” హిందీ చిత్రంతో ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చుకొంది ఈ భామ. అలాగే తెలుగులో మొదటి చిత్రంగా ప్రభాస్ సరసన ఛాన్స్ కొట్టేసింది. వంగా ప్రభాస్ హీరోగా తీస్తున్న తెలుగు చిత్రం “స్పిరిట్”లో తృప్తి కథానాయిక.
తాజాగా ఈ భామ మరో తెలుగు సినిమాలో ఆఫర్ దక్కించుకుంది అని టాక్. నాని హీరోగా దర్శకుడు సుజీత్ తీయబోతున్న సినిమాలో తృప్తిని హీరోయిన్ గా ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాని పాన్ ఇండియా మార్కెట్ కోసం సుజీత్ తీస్తున్నాడు. అందుకే, బాలీవుడ్, పాన్ ఇండియా స్టార్స్ ని లాగుతున్నారు. ఆ క్రమంలో తృప్తిని తీసుకున్నారట.
తృప్తి “యానిమల్” సినిమాకి ముందు, ఆ తర్వాత పలు హిందీ సినిమాల్లో నటించింది. కానీ అవేవీ “యానిమల్” స్థాయిలో ఆడలేదు, అంత పేరు తీసుకురాలేదు. ఇప్పుడు ఈ రెండు తెలుగు సినిమాలతో తన స్థాయిని పెంచుకునే పనిలో ఉంది.
