
మోహన్ లాల్ (Mohanlal) నటించిన “దృశ్యం” (Drishyam)మలయాళంలో ఎంత పాపులరో తెలుగులో కూడా అంతే పాపులర్. తెలుగులో వెంకటేష్ రెండు భాగాల్లో నటించారు. ఇప్పుడు ఈ సిరీస్ లో మోహన్ లాల్ హీరోగా మూడో భాగం వస్తోంది. “దృశ్యం 3” (Drishyam 3) ట్రైలర్ తాజాగా విడుదలైంది. మే 21న ఈ సినిమా విడుదల కానుంది.
వెంకటేష్ హీరోగా తెలుగులో కూడా “దృశ్యం 3” వస్తుందా, రాదా? అన్న సందిగ్ధత ముగిసింది. తెలుగులో రీమేక్ కావడం లేదు. తెలుగులో కూడా మోహన్ లాల్ వర్షన్ మాత్రమే విడుదల కానుంది.
హిందీలో “దృశ్యం 3” పేరుతోనే అజయ్ దేవ్గణ్ హీరోగా హీరోగా తెరకెక్కి స్తున్నారు. కానీ తెలుగులో మాత్రం రీమేక్ చెయ్యడం లేదు. ప్రస్తుతం వెంకటేష్ సక్సెస్ ఫుల్ గా హిట్స్ ఇస్తున్నారు. “సంక్రాంతికి వస్తున్నాం” పెద్ద హిట్. చిరంజీవి “మన శంకర్ వర ప్రసాద్”లో కూడా ఒక కీలక పాత్ర చేస్తే అది కూడా హిట్ అయింది. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకుడిగా “ఆదర్శ కుటుంబం” సినిమాలో నటిస్తున్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారు. సో వెంకటేష్ కి ఇప్పుడు ఈ రీమేక్ అవసరం లేదు.
‘దృశ్యం 3’లో మోహన్ లాల్ తో పాటు ఆయన భార్యగా మీనా నటించారు. తెలుగులో కూడా తాజాగా ట్రైలర్ (Drishyam 3 Telugu Trailer) వచ్చింది.
