
మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందిన “మన శంకరవరప్రసాద్ గారు” బాక్సాఫీస్ వద్ద పాస్ అయిపొయింది. ప్రసాద్ ఏకంగా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. మొదటి రెండు రోజుల కలెక్షన్లతో టీం అంతా ఆనందంగా ఉంది.
ప్రభాస్ నటించిన “ది రాజా సాబ్,” రవితేజ నటించిన “భర్త మహాశయులకు విజ్ఞప్తి” విడుదల అయ్యాయి. అయినా ప్రసాద్ కి కలెక్షన్లు గట్టిగానే ఉన్నాయి. మొదటి చాయిస్ గా సినిమా నిలుస్తోంది.
ఈ సినిమా కలెక్షన్లకు ప్రధాన బలం… ఫ్యామిలీ ఆడియెన్స్. ఇక అసలైన సంక్రాంతి పండుగ ఆంధ్రాలో రేపు భోగి నుంచి మొదలవుతుంది. భోగి, సంక్రాంతి, కనుమ కలెక్షన్లు మాములుగా ఉండవు. ఆ తర్వాత శనివారం, ఆదివారం వస్తున్నాయి. అంటే వచ్చే ఐదు రోజులు కలెక్షన్ పండుగే.
మెగాస్టార్ చిరంజీవికి ఇది పెద్ద రిలీఫ్. భోళా శంకర్ లాంటి డిజాస్టర్ తర్వాత మంచి హిట్ పడింది. ఐతే, ఈ సినిమా ఓవరాల్ కలెక్షన్ల గురించి ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ పక్కాగా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది అని చెప్పొచ్చు.
“మన శంకర వర ప్రసాద్ గారు” చిత్రంలో చిరంజీవి సరసన నయనతార నటించింది. వెంకటేష్ ఒక కీలక పాత్ర పోషించారు.
