
రష్మిక మందాన, విజయ్ దేవరకొండ కలిసి ఇటీవల ఇటలీ వెళ్లి వచ్చారు. క్రిస్మస్ కి వెళ్లి న్యూ ఇయర్ వేడుకలు అక్కడే జరుపుకొని ఇటీవలే తిరిగొచ్చారు. ఐతే, తమ బంధం గురించి ఈ జంట ఇంకా అధికారికంగా ప్రకటన చెయ్యడం లేదు. వచ్చే నెలలో ఇద్దరి పెళ్లి కూడా ఉంది అని ప్రచారం జరుగుతోంది.
ఐతే, తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలకు క్యాప్సన్ రాస్తూ “మేము” ఇటీవల అమాల్ఫీ కోస్ట్ వెళ్లి వచ్చామని తెలిపింది. “మేము” అంటే ఎవరెవరో క్లియర్ గా రాయి అక్క అంటూ ఆమె అభిమానులు ఆమెని కామెంట్స్ లో టీజ్ చేస్తున్నారు.
రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి నిశ్చతార్ధం జరిగింది. వీరి పెళ్లి కూడా వచ్చే నెలలోనే జరుగుతుంది. అయినా ఇంకా ఎందుకు సీక్రెట్ మైంటైన్ చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి.
మరోవైపు, ఈ జంట మరోసారి కలిసి నటిస్తోంది. ప్రస్తుతం ఆ షూటింగ్ జరుగుతోంది.
