మైత్రికి ప్రభాస్ హ్యాండ్ ఎందుకిచ్చాడు?

- Advertisement -
Prabhas

ప్రభాస్ వరుసగా సినిమాలు ప్రకటించాడు. అందులో నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రూపొందుతోన్న మూవీ తప్ప మిగతావన్నీ వేరే భాష నిర్మాతల తీస్తున్నవే. ఆదిపురుష్ సినిమాకి ట్-సిరీస్ భూషణ్ కుమార్ నిర్మాత. “సాలార్” సినిమాకి కన్నడ నిర్మాతలు. ఒక్క అశ్వనీదత్ (నాగ్ అశ్విన్ మూవీ)కి తప్ప మరో తెలుగు నిర్మాతకి ప్రభాస్ ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు?

నిజానికి కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ – ప్రభాస్ కాంబినేషన్ ని మైత్రి మూవీస్ సెట్ చేసింది. మైత్రి మూవీస్ ప్రశాంత్ కి ఈ సినిమా కోసమే అడ్వాన్స్ ఇచ్చింది. కానీ ప్రభాస్ ఎందుకో మైత్రికి హ్యాండిచ్చాడు. అలాగే, నిర్మాత దిల్ రాజుకి సినిమా చేస్తానని బాహుబలి తర్వాత మాటిచ్చాడు. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ దశరధ్, సురేందర్ రెడ్డి సహా పలువురు దర్సకులని దిల్ రాజు ప్రభాస్ దగ్గరికి తీసుకెళ్లాడు. కానీ ప్రభాస్ దిల్ రాజుకి కూడా ఎస్ చెప్పలేదు.

ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు కోరుకుంటున్నాడు. తనకి 80 కోట్ల పారితోషికం, సినిమాని 300 కోట్ల బడ్జెట్ తో తీసే నిర్మాతలు, దర్శకులకే ప్రాధాన్యం ఇస్తున్నాడు.

More

Related Stories