
దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel)కి ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. ఉగ్రం, కేజీఎఫ్, సలార్… ఈ మూడు సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు నీల్. అన్ని సినిమాలు ఒకే తీరుగా ఉంటాయి అనే విమర్శ కూడా ఉంది. కానీ నీల్ తనదైన శైలిలోనే తీసి భారీ పాన్ ఇండియా హిట్స్ ఇస్తున్నాడు.
ఇప్పుడు “డ్రాగన్”(Dragon)తో మరో భారీ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా మొదటి గ్లిమ్ప్స్ ఇటీవలే విడుదలఅయింది. ఫస్ట్ గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచే చర్చ మొదలైంది.
“నా బాల్యం నా సినిమాల్లో ఎప్పుడూ ఒక భావోద్వేగంగా ఉంటుంది. ‘డ్రాగన్’లో కూడా అదే నా అతిపెద్ద బలం. నేను ఇప్పటివరకు చెప్పిన కథల కంటే ఇది మరింత వాస్తవికంగా ఉంటుంది. కథ ముంబై, కోల్కతా నగరాల నేపథ్యంలో సాగుతుంది కాబట్టి ఆ ప్రపంచం కూడా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది,” అని అసలు విషయాన్ని బయట పెట్టారు.
“నల్లమందు అక్రమ రవాణా చుట్టూ ఈ కథను అల్లాను. బ్రిటిష్ పాలన కాలంలో మొదలైన కొన్ని వ్యాపారాలు వారు వెళ్లిపోయిన తర్వాత కూడా కొనసాగాయి. అలాంటి వాస్తవ అంశాల ఆధారంగా ఒక బలమైన నాటకీయ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాను. 1967 కాలాన్ని అత్యంత సహజంగా, వాస్తవికంగా తెరపై చూపించేందుకు ప్రయత్నిస్తున్నాం” అని తెలిపారు నీల్.
