
రామ్ చరణ్ హీరోగారూపొందుతోన్న “పెద్ది” (Peddi) సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకొంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రెండు పాటలు వచ్చాయి. ఒకటి జాన్వీ కపూర్ అందాన్ని వర్ణిస్తూ రామ్ చరణ్ పాడే “చికిరి” పాట, మరోటి రామ్ చరణ్ ఇంట్రడిక్షన్ గా సాగే “రై రై రా రా” అనే పాట.
ఇక ఇప్పుడు ఈ సినిమాలో ఐటెం సాంగ్ గురించి చర్చ జరుగుతోంది.
దర్శకుడు బుచ్చి బాబు ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ని డిజైన్ చేశారట. ఏ ఆర్ రెహమాన్ స్వరపరుస్తున్న ఈ ఐటెం సాంగ్ చాలా హైలెట్ గా ఉంటుంది అని అంటున్నారు. ఈ పాట కోసం ఎవరిని తీసుకోవాలి అనే విషయంలో ఇంకా నిర్ణయానికి రాలేదంట
ఆయేషా ఖాన్, మృణాల్ ఠాకూర్, దిశా పటాని వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఒక వారం రోజుల్లో క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఏప్రిల్ 30న సినిమాని విడుదల చెయ్యాలంటే ఈ నెలాఖరులోపు మొత్తం షూటింగ్ పూర్తి చెయ్యాలి.
