
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్తో అందరి దృష్టిని ఆకర్షించింది. లగ్జరీ ట్రెండ్ ను ప్రతిబింబించేలా ఆమె ధరించిన హెడ్-టు-టో బ్రాండెడ్ దుస్తులు ఫ్యాషన్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఫ్యాషన్ పరిభాషలో దీన్ని పవర్ డ్రెస్సింగ్ అంటారు.
ఈ లుక్ కోసం జాన్వీ కపూర్ పూర్తిగా ‘రాల్ఫ్ లారెన్’ బ్రాండ్ దుస్తులనే ఎంచుకుంది. ఇందులో ప్రధానంగా రూ. 3,46,500 విలువ చేసే ఉన్ని జాకెట్ ధరించింది.
ఈ జాకెట్కు జోడీగా ఆమె రూ. 26,600 విలువైన ఐవరీ రంగు ప్యాంటు ధరించింది. ఇక రూ.23,800 విలువైన టై-నెక్ బ్లౌజ్ ధరించింది. అలాగే సుమారు రూ. 1,60,000 విలువ చేసే యాక్ససిరీస్ ధరించింది. వీటిలో ఒక్క సన్ గ్లాసెస్ ఖరీదే అక్షరాలా 28వేలు.
చూడ్డానికి సింపుల్ గా అనిపించినప్పటికీ అటుఇటుదా దాదాపు 5 లక్షల రూపాయల ఖరీదైన దుస్తులు, యాక్ససిరీస్ ధరించి మ్యాచ్ కు వచ్చింది జాన్వి. ఆమె స్టైలింగ్ పై గడిచిన 2 రోజులుగా ఒకటే చర్చ. మ్యాచ్ ను మరిచిపోయినా, జాన్వి స్టైలింగ్ ను కొంతమంది మరిచిపోలేకపోతున్నారు.
