
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చర్చ అనవసరం. ఆ సినిమా కాలగర్భంలో కలిసిపోయినా, అందులోని ఓ పాట మాత్రం ఇంకా సోషల్ మీడియాను హోరెత్తిస్తూనే ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కంపోజ్ చేసిన ఊరమాస్ సాంగ్, ‘కుర్చీ మడతపెట్టి’ (Kurchi Madathapetti). థియేటర్లలోనే కాదు, సోషల్ మీడియాలోనూ ఊచకోత కోస్తోంది.
నిజానికి ఈ పాట రిలీజైన కొత్తలో కొన్ని వివాదాలు, విమర్శలు చుట్టుముట్టినప్పటికీ.. వాటన్నింటినీ తన మాస్ బీట్తో తొక్కిపారేసింది ఈ సాంగ్. ఆ కాంట్రవర్సీలన్నింటినీ దాటుకుని గ్లోబల్ లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ పాట, తాజాగా యూట్యూబ్లో మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
టాలీవుడ్ హిస్టరీలోనే మరే పాటకూ సాధ్యం కాని రీతిలో, అత్యంత వేగంగా ఏకంగా 800 మిలియన్ల వ్యూస్ మార్కును దాటేసి ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ సరికొత్త రికార్డును స్థాపించింది. ప్రస్తుతం యూట్యూబ్లో ఈ పాట దూసుకుపోతున్న స్పీడ్ చూస్తుంటే, చాలా త్వరలోనే వంద కోట్లు (1 బిలియన్) వ్యూస్ మైలురాయిని కూడా అందుకునేలా ఉంది.
ఈ పాట ఈ రేంజ్ సక్సెస్ సాధించడానికి మెయిన్ రీజన్ స్క్రీన్ మీద మహేష్ బాబు, శ్రీలీల వేసిన ఊరమాస్ స్టెప్పులే. వీరిద్దరి అదిరిపోయే ఎనర్జీకి, థమన్ ఇచ్చిన హై-వోల్టేజ్ బీట్స్ తోడవడంతో పెద్ద హిట్టయింది.
సినిమా రిలీజై ఇన్నాళ్లవుతున్నా, రీల్స్ లోనూ, షార్ట్స్లోనూ ఇప్పటికీ ‘కుర్చీ మడతపెట్టి’ ట్రెండ్ అవుతూనే ఉంది. పెళ్లిళ్లు, పార్టీలు, ఈవెంట్స్ ఎక్కడ చూసినా ఈ పాట మోత మోగాల్సిందే. గ్లోబల్ ఆడియన్స్ని సైతం మెప్పించడంతో, ఈ పాటకు ఇన్ని వ్యూస్ సాధ్యమైంది.
