
షారుఖ్ నటించిన ‘జవాన్’ చిత్రంతో హిందీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది నయనతార (Nayanthara). ఆ సినిమాలో తన స్టైలిష్ యాక్షన్ సీన్స్తో అందరినీ మెప్పించిన ఆమె, ఇప్పుడు సల్మాన్ ఖాన్ – వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సరికొత్త చిత్రంలో కూడా యాక్షన్ లుక్ లో కనిపించనుంది.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ సినిమాలో నయనతార కేవలం గ్లామర్కే పరిమితం కాకుండా, కీలకమైన ఎపిసోడ్ లో యాక్షన్ మోడ్ లో కూడా కనిపించబోతోందంట.
దీనికి సంబంధించి ఆల్రెడీ ఓ షెడ్యూల్ పూర్తయినట్టు తెలుస్తోంది. నిపుణుల సమక్షంలో నయనతారపై కొన్ని యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించారట. త్వరలోనే మరో షెడ్యూల్ లో నయనతారపై ఈ ఎపిసోడ్ ను కొనసాగిస్తారని తెలుస్తోంది.
షూటింగ్ సెట్స్లో సల్మాన్, నయనతారల మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని, వీరిద్దరి స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను కచ్చితంగా నచ్చుతుందని మేకర్స్ చెబుతున్నారు.
ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, కుల్దీప్ రాథోడ్ సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం 2027 రంజాన్ కానుకగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సినిమాకు అనిరుధ్, తమన్ కలిసి వర్క్ చేస్తారనే ప్రచారం సాగుతోంది.
