క్యాన్సర్ బాధిత చిన్నారులతో అడవి శేష్

టాలీవుడ్‌లో ఒక సెపరేట్ రూట్‌తో ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్న హీరో అడవి శేష్. అడవి శేష్ సినిమాల కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. తాజాగా ఆయన తన మంచి మనసుతో ఆకట్టుకున్నాడు. దీంతో శేష్‌ను రియల్ హీరో అని అభిమానులు, సినీ ప్రియులు మెచ్చుకుంటున్నారు.

ఎప్పుడూ సినిమా షూటింగ్‌లతో గడిపే అడవి శేష్ తాజాగా క్యాన్సర్ బాధిత పిల్లలతో సరదాగా గడిపిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వారిలో ఒకడిగా కలిసిపోయి.. ఆడి పాడి వారిలో ధైర్యాన్ని నింపాడు. తాజాగా జూడ్‌ అనే ఓ స్వచ్ఛంద సేవా సంస్థకు అడవి శేష్ వెళ్లాడు. క్యాన్సర్ బాధిత చిన్నారుల్లో జోష్ నింపేలా ఆడి పాడి వారికి కొన్ని బహుమతులు కూడా అందజేశాడు. వీటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటోలతో ఆయన పెట్టిన పోస్ట్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

‘పిల్లలతో గడపడం నా జీవితంలో చాలా గొప్ప సందర్భం. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఈ పిల్లలు చాలా ధైర్యంగా ఉన్నారు. వారు నాకు చాలా ఆశను కల్పించారు. ఈ అవకాశం కల్పించిన కమలేష్, లక్ష్మికి ధన్యవాదాలు’ అంటూ అడవి శేష్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

మేజర్, హిట్ 2 చిత్రాలతో గత ఏడాది సూపర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్న శేష్.. ఇప్పుడు ‘గూఢచారి 2’ చేస్తున్నాడు.

Advertisement
 

More

Related Stories