కరోనా రెండో వేవ్ కారణంగా అన్ని సినిమాలు వాయిదాపడ్డాయి. అన్ని చిత్రాలు తమ సినిమాలను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ఇంకా, బాలకృష్ణ టీం నుంచి మాత్రం ప్రకటన రాలేదు. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో రూపొందుతోన్న మూడో చిత్రం.. ‘అఖండ’. ఈ సినిమాని మే 28న విడుదల చేయాలనుకున్నారు. కానీ అది ఇప్పుడు సాధ్యపడదు.
తాజా సమాచారం ప్రకారం ‘అఖండ’ చిత్రాన్ని ఆగస్టులో రిలీజ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారట బోయపాటి. అప్పటికి పరిస్థితులు అనుకూలిస్తే… ‘అఖండ’ థియేటర్లోకి వచ్చేస్తుంది. లేదంటే… వెయిట్ చెయ్యాలిసిందే!
ఈ సినిమాకి మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. టైటిల్ టీజర్ కి ఇప్పటివరకు 53 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. బాలకృష్ణ సరసన ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
Advertisement