అల్లు అర్జున్ మొన్నటి వరకు విదేశాల్లో విహార యాత్ర చేసి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఫారిన్ వెళ్ళాడు. ఐతే, ఈ సారి షూటింగ్ కోసం. అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే ఒక యాడ్ చిత్రీకరణ విదేశాల్లో జరగనుంది.
ఈ యాడ్ ని ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తీస్తున్నారు. బన్ని, హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఇంతకుముందు ‘డీజె’ చిత్రం వచ్చింది. ఆ సినిమా నుంచి వారి బంధం బలపడింది. ఈ యాడ్ ని ముంబైకి చెందిన టీమ్ ని తీస్తోంది. కానీ, బన్నీ పట్టుబట్టి హరీష్ ని డైరెక్టర్ గా తీసుకున్నారు. హరీష్ పర్యవేక్షణలో ఆ టీం ఈ యాడ్ ని చిత్రీకరిస్తుంది.
‘పుష్ప’ సినిమా తర్వాత బన్ని రేంజు మారిపోయింది. కార్పొరేట్ కంపెనీలు కూడా అల్లు అర్జున్ పై ఎక్కువ ఖర్చు పెట్టి యాడ్స్ తీస్తున్నాయి.
వచ్చేనెలలో కానీ, సెప్టెంబర్ లో కానీ ‘పుష్ప 2’ షూటింగ్ మొదలవుతుంది.