ఈ రీమేక్ కూడా చేస్తారా?

Chiranjeevi

చిరంజీవి చేతిలో ఆల్రెడీ 2 రీమేక్స్ ఉన్నాయి. “లూసిఫర్” రీమేక్ ఎప్పట్నుంచో నలుగుతోంది. తాజాగా “వేదాళం” రీమేక్ వచ్చి చేరింది. వీటిలో ముందుగా సెట్స్ పైకి వచ్చేది “వేదాళం” రీమేక్. ఇదిలా ఉండగా.. ఇప్పుడు చిరు ఖాతాలోకి మరో రీమేక్ వచ్చి చేరిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.

తమిళ్ లో హిట్టయిన “ఎన్నై అరిందాళ్” అనే సినిమాను చిరంజీవి తెలుగులో రీమేక్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. తమిళ్ లో ఈ సినిమాను అజిత్ చేశాడు. గౌతమ్ మీనన్ దర్శకుడు.

ఇదొక పోలీస్ స్టోరీ. ఓ పోలీస్ వృత్తిగత జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని కలిపి చూపించే ఎమోషనల్ యాక్షన్ డ్రామా ఇది. పూర్తిగా గౌతమ్ మీనన్ మార్క్ సినిమా ఇది. ఇలాంటి మూవీని, ఈ వయసులో చిరంజీవి రీమేక్ చేస్తారా అనేది అందరి డౌట్.

ఇంతకీ ఈ పుకారు పుట్టడానికి కారణం ఏంటంటే.. ఈ సినిమా రీమేక్ రైట్స్ ను నిర్మాత ఏఎం రత్నం దక్కించుకున్నారట. పవన్ కల్యాణ్ ద్వారా ఆయన చిరంజీవి కోసం ప్రయత్నిస్తున్నారట. అన్నట్టు ఈ సినిమా తెలుగులోకి కూడా డబ్ అయింది. “ఎంత వాడు కానీ” అనే టైటిల్ తో ఇది రిలీజైంది. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఈ సినిమాపై సోషల్ మీడియాలో జోరుగా చర్చించుకుంటున్నారు.

Advertisement
 

More

Related Stories