- Advertisement -

దీపిక పదుకొనె తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. ఆమె ప్రభాస్ సరసన నటించనుంది. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ తీయనున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక, లెజెండరీ యాక్టర్ అమితాబ్ నటించేందుకు ఒప్పుకున్నారు. ఐతే, కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతోంది.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది మొదలు కానుందని ఇప్పటికే తెలుగుసినిమా.కామ్ రాసింది. దీపిక పదుకోన్ జులై 2021 నుంచి డేట్స్ ఇస్తాను అని చెప్పింది. ఇప్పుడు అవి అవసరం పడవు. ఈ ఏడాది మొత్తంగా ఆమె డేట్స్ ని వాడలేరు. మరి నెక్స్ట్ ఇయర్ ఆమెని తమ సినిమా షూటింగ్ కి రప్పించాలంటే టీం కొంచెం కష్టపడాలి.
ప్రస్తుతం ఆమె హిందీలో మూడు సినిమాలు ఒప్పుకొంది.