జగపతిబాబు, రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, బేబి సహశ్రిత టైటిల్ రోల్స్ పోషించిన ‘ఎఫ్సీయూకే (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్)’ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది.
లేటెస్ట్గా పాపులర్ సింగర్ గీతామాధురి కుమార్తె బేబి ప్రకృతి చేతుల మీదుగా “పువ్వల్లే మేలుకున్నది” అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు.
మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ, ఈ పాట పిల్లలు, వారి తల్లిదండ్రుల మధ్య అనుబంధానికి సంబంధించిందనీ, “పువ్వల్లే మేలుకున్నది” పాట ఆవిష్కరణలో బేబి ప్రకృతి, అమ్మ గీతామాధురి మధ్య ఆ అనుబంధమే ప్రతిఫలించడం చూడ్డానికి ఎంతో బాగుందనీ అన్నారు.
రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకూ విడుదల చేసిన క్యారెక్టర్ లుక్ పోస్టర్లు కానీ, టీజర్ కానీ ఆడియెన్స్ను అమితంగా ఆకట్టుకున్నాయి.