కీర్తికి మిస్ అయిన ఛాన్స్

Keerthy Suresh


కీర్తి సురేష్ – నాగ చైతన్య ఈ కాంబినేషన్ కొత్తగా ఉంటుంది అనుకున్నారు అంతా. నాగ చైతన్యతో కీర్తి సురేష్ నటించడం ఖాయం. ఈ మేరకు అంతా సెట్ అయింది అని ఇంతకుముందు తెలుగుసినిమా.కామ్ వెల్లడించింది. ఐతే, ఇప్పుడు సీన్ మారింది. నాగ చైతన్య కొత్త సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.

దర్శకుడు చందూ మొండేటి అనుపమ పరమేశ్వరన్, సాయి పల్లవి, కీర్తి సురేష్ పేర్లను అనుకున్నారు. ఆల్రెడీ ‘కార్తికేయ 2’లో అనుపమ పరమేశ్వరన్ తో దర్శకుడు సినిమా చేశారు. నాగ చైతన్య ఆమెతో “ప్రేమమ్”లో నటించాడు. సాయి పల్లవి ఇప్పటికే నాగ చైతన్యతో ‘లవ్ స్టోరీ’లో నటించింది. సో, కీర్తి సురేష్ జోడి బాగుంటుంది అని టీం మొత్తం భావించింది.

కానీ కథ ప్రకారం సాయి పల్లవి అయితేనే బాగుంటుంది అన్న ఆలోచన మేరకు చివరికి ఆమెనే తీసుకున్నారు. ఆమె పేరుని తాజాగా ప్రకటించారు. నిర్మాత అల్లు అరవింద్ ఆమెకి అడ్వాన్స్ ఎమౌంట్ తో కూడిన చెక్ కూడా ఇచ్చారు.

అలా కీర్తి సురేష్ నాగ చైతన్యతో జత కట్టే అవకాశాన్ని మిస్ అయింది.

Advertisement
 

More

Related Stories