కృతి పెళ్లి వేదిక ఖరారు!

పవన్ కళ్యాణ్ సరసన “తీన్ మార్”, రామ్ సరసన “ఒంగోలు గిత్త” వంటి సినిమాల్లో నటించిన కృతి ఖర్బందా పెళ్లి చేసుకోనుంది. చాలా కాలంగా డేటింగ్ చేస్తున్న తన ప్రియుడితోనే ఆమె పెళ్లి.

ఈ వార్త అందరికీ తెలుసు. తాజా కబురు ఏంటంటే పెళ్లి వేదిక కూడా ఫిక్స్ అయింది. కృతి పెళ్లి హర్యానాలో మానెసర్ లో జరగనుంది. ITC గ్రాండ్ భారత్ హోటల్ లో వీరి పెళ్లి జరుగుతుంది. ఇటీవలే ఈ హోటల్ ని బుక్ చేశారు పెళ్లి కోసం.

కృతి ఖర్బందా బాలీవుడ్ హీరో పుల్కిత్ సమ్రాట్ తో ఐదారేళ్లుగా డేటింగ్ లో ఉంది. ఇప్పటికే వీరి ఎంగేజ్ మెంట్ కూడా అయింది.

కృతి ఖర్బందా పుట్టింది, పెరిగింది బెంగళూరులో. కానీ ఆమె కెరీర్ తెలుగు, హిందీ సినిమాల్లోనే సాగింది. ఫైనల్ గా ముంబైలో స్థిరపడింది. అక్కడే పుల్కిత్ తో ప్రేమలో పడి ఇప్పుడు పెళ్లి చేసుకుంటోంది.

పుల్కిత్ కి 40 ఏళ్ళు. అతనికి ఇంతకుముందు ఒక పెళ్లి జరిగింది. అది డివోర్స్ అయింది. కృతికి 33 ఏళ్ళు. ఆమెకిదే మొదటి పెళ్లి.

Advertisement
 

More

Related Stories