హీరోల కొడుకులతో ఖుషి

Kushi Kapoor

జాన్వీ కపూర్ ఇప్పుడు తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఆమె ఆల్రెడీ హిందీలో పలు సినిమాలు చేసింది. బాలీవుడ్ లో కాస్త పేరు తెచుకున్నాకే ఆమె తెలుగులోకి అడుగుపెట్టింది. ఇప్పుడు రెండు బడా తెలుగు సినిమాలు చేస్తోంది. ఇక ఆమె సోదరి ఖుషి కపూర్ కూడా బాలీవుడ్ లో బిజీ అవుతోంది.

ఖుషి కపూర్ ఒకేసారి రెండు కొత్త సినిమాలు ఒప్పుకొంది.

అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అతని మొదటి చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఇందులో సాయి పల్లవి హీరోయిన్. మొదటి సినిమా షూటింగ్ లైన్లో ఉండగానే రెండో చిత్రం కూడా సైన్ చేశాడు. ఈ రెండో చిత్రంలో ఖుషి కపూర్ హీరోయిన్ గా నటించనుంది. అలాగే సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం హీరోగా పరిచయం కానున్నాడు. అతని మొదటి చిత్రంలో ఖుషి కపూర్ హీరోయిన్ అని అంటున్నారు.

ఇలా జాన్వీ కపూర్ కన్నా ఎక్కువగా బాలీవుడ్ లో దూసుకెళ్తోంది ఖుషి కపూర్. మరి ఈ భామ కూడా అక్కలాగా తెలుగులో కూడా నటిస్తుందా అనేది చూడాలి.

Advertisement
 

More

Related Stories