- Advertisement -

మహేష్ బాబు, తమన్న కలిసి నటించిన యాడ్ షూటింగ్ నేటితో పూర్తి అయింది. ఈ యాడ్ ని ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీశాడు. హావెల్స్ బ్రాండ్ కి చెందిన సమ్మర్ ప్రొడక్ట్స్ ప్రచారం కోసం ఈ యాడ్ కమర్షియల్ చిత్రీకరించారు. సందీప్ వంగాకి భారీ మొత్తం ఇచ్చి ఈ యాడ్ ని డైరెక్ట్ చేయించడం విశేషం.
తమన్న, మహేష్ బాబు ఒక యాడ్ కలిసి చెయ్యడం ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు, ‘ఆగడు’ సినిమాలో హీరోయిన్ గా నటించింది తమన్న. అలాగే, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ఐటెం సాంగ్ చేసింది.