- Advertisement -

‘శత్రువు’, ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు నిర్మించిన ఎంఎస్ రాజు ఇటీవల దర్శకుడుగా మారారు. గత ఏడాది ‘డర్టీ హరి’ అనే అడల్ట్ మూవీ తీశారు. మే 10 (సోమవారం) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా దర్శకుడిగా ఎంఎస్ రాజు తదుపరి చిత్రాన్ని ప్రకటించారు.
ఆయన డైరక్షన్లో ‘7 డేస్ 6 నైట్స్’ పేరుతో ఓ సినిమా తెరకెక్కనుంది. జూన్ 7న చిత్రీకరణ ప్రారంభించాలని అనుకుంటున్నామన్నారు నిర్మాతలు. నటీనటుల వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు.
ఇకపై ఇలాంటి అడల్ట్ కంటెంట్ మూవీస్ తీయాలని ఫిక్స్ అయినట్లుంది ఎమ్మెస్ రాజు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్పతాకంపై తెరకెక్కనుంది ‘7 డేస్ 6 నైట్స్’.