మాల్దీవుల్లోకి నో ఎంట్రీ!

నిన్నామొన్నటివరకు హీరోయిన్లు అందరూ మాల్దీవుల బాట పట్టారు. దేశంలో అందరూ కరోనాతో సతమతవుతుంటే… వీళ్ళు మాల్దీవుల బీచుల్లో ఎంజాయ్ చేశారు. వాళ్ళ డబ్బు వాళ్ళిష్టం అనుకొండి! ఐతే, దీనిపై కూడా చాలా విమర్శలు వచ్చాయి.

కరోనా వల్ల తిండి లేక లక్షలాది మంది అల్లాడుతుంటే… మీరు బికినీలు వేసుకొని మాల్దీవుల్లో డబ్బును నీళ్లలా ఖర్చుపెడుతూ, ఆ ఫోటోలను, వీడియోలను సోషల్ మిడియాలో షేర్ చేసేందుకు సిగ్గులేదా అంటూ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి గట్టిగా విమర్శలు చేశాడు. దాంతో బాలీవుడ్ హీరోయిన్లు ఆ ట్రెండ్ కి కామా పెట్టారు.

ఇప్పుడు బాలీవుడ్ హీరో, హీరోయిన్లకే కాదు భారతీయులెవ్వరికీ తమ దేశంలోకి ఎంట్రీ లేదని మాల్దీవులు ప్రకటించింది. భారతదేశంలో కరోనా ఉధృతి చూసి మాల్దీవుల ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. రేపటి నుంచి (మే 13, 2021) భారతీయులెవ్వరికీ మాల్దీవులలోకి ప్రవేశం ఉండదు.

ఆ దీవుల్లో ప్రస్తుతం కరోనా వైరస్ కేసుల్లేవు. ఇప్పుడు ఇండియా నుంచి టూరిస్టులను అనుమతిస్తే… అక్కడ కూడా కల్లోలం రేగుతుందని ఆ ప్రభుత్వం మన దేశం నుంచి వచ్చే టూరిస్టులకు అనుమతి రద్దు చేసింది.

రీసెంట్ గా అలియా భట్, జాహ్నవి కపూర్, కత్రినా కైఫ్, శ్రద్ధ కపూర్, అనన్య, నిహారిక కొణిదెల, సమంత వంటి వారు మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేశారు.

Advertisement
 

More

Related Stories