మహేష్ బాబు చాలా గ్యాప్ తర్వాత గుంటూరు కారం” సినిమాలో యమా డ్యాన్స్ చేశారు. మాస్ స్టెప్పులు వేశారు. ఎంతో కష్టపడి “కుర్చీ మడత పెట్టి”, “మావ ఎంతైనా” వంటి పాటల్లో అదరగొట్టే స్టెప్పులు వేశారు.
ఇకపై ఇలాంటి డ్యాన్సులు చేసే అవకాశం వస్తుందో రాదో అనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు మహేష్ బాబు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దానికి కారణం ఏంటంటే మహేష్ బాబు ఈ ఏడాది రాజమౌళి సినిమా షూటింగ్ పాల్గొంటారు. ఇది పూర్తి అయ్యేసరికి 2025 అయిపోతుంది. ఆ సినిమా 2026లో విడుదల అవుతుంది.
ఎలా చూసుకున్నా వచ్చే మూడేళ్లల్లో మహేష్ బాబు నుంచి ఒక్క రాజమౌళి సినిమా మినహా మరోటి రాదు. రాజమౌళి సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, విడుదలై ఆ తర్వాత ఇంకో సినిమా మొదలెట్టి, దాన్ని విడుదల చేసేసరికి 2028 వస్తుంది. అప్పటికి మహేష్ బాబు వయసు కూడా 54 అవుతుంది. పైగా రాజమౌళి సినిమాతో మహేష్ బాబుకి గ్లోబల్ లెవల్లో క్రేజ్, పాపులారిటీ వస్తుంది. అప్పుడు ఇలాంటి స్టెప్పులు వేసే అవకాశం ఉండకపోవచ్చు.
అందుకే ఇకపై మాస్ స్టెప్పులు మహేష్ బాబు వెయ్యకపోవచ్చు.