టాలీవుడ్ లో అన్ని ‘పాన్ ఇండియా’నే!

Movie Shootings

ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, కళ్యాణ్ రామ్, అడివి శేష్… ఇలా బడా స్టార్స్, చోటా స్టార్స్ అందరూ ‘పాన్ ఇండియా’ సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘పాన్ ఇండియా’ ప్రాజెక్ట్ అనేది ఈజీ అయిపోయింది, క్రేజ్ గా మారింది.

రాజమౌళి తీస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’తో ఎన్టీఆర్, రామ్ చరణ్ జాతీయ స్థాయి మార్కెట్ పై కన్నేశారు. రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని మెగా దర్శకుడు శంకర్ డైరెక్షన్లో సెట్ చేశారు. ఎన్టీఆర్… కొరటాల, ప్రశాంత్ నీల్ సినిమాలు చేయనున్నారు. ఈ రెండూ పాన్ ఇండియా చిత్రాలే.

విజయ్ దేవరకొండకి ఏకంగా బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ అండ దొరికింది. పూరి తీస్తున్న ‘లైగర్’ సినిమాని కరణ్ పాన్ ఇండియా సినిమాగా మార్చేశారు. అడివి శేష్ నటిస్తున్న ‘మేజర్’ కూడా అలాగే మారింది.

లేటెస్ట్ గా కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ పేరుతో ఒక ‘పాన్ ఇండియా’ మూవీ ప్రకటించారు. బెల్లంకొండ శ్రీనివాస్ ఏకంగా హిందీలోనే ఒక మూవీ చేస్తున్నారు. రానా ఆల్రెడీ నేషనల్ లెవల్లో తెలిసిన హీరో.

సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు కూడా వచ్చే ఏడాది ఈ బాటలోకి వచ్చేలా ప్లాన్ ఉంది.

ఈ రేసులోకి ఇంకా అడుగుపెట్టని హీరోలు ఎవరంటే నాని, రవితేజ, నిఖిల్ సిద్ధార్థ్, నితిన్, నాగ చైతన్య, అఖిల్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్. మెల్లగా వీరు కూడా ప్లాన్ చేసే అవకాశముంది. ఏతావాతా, టాలీవుడ్ లో ‘పాన్ ఇండియా’ అనేది ఒకప్పుడు నిర్మాతలు తమ సినిమా డాల్బీ సౌండ్ తో రూపొందింది అని చెప్పుకున్నట్లు తయారైంది.

Advertisement
 

More

Related Stories