
పూజ హెగ్డే ఎక్కువగా ఆన్లైన్ గేమ్స్ ఆడుతుంటుంది. టైం దొరికితే మొబైల్ లో, ట్యాబులో గేమ్స్ ఓపెన్ చేసి అందులోనే లీనమైపోతుందట. ఒకేసారి మూడు, నాలుగు సినిమాల షూటింగ్ లతో తెగ బిజీగా ఉండే ఆమె స్ట్రెస్ రిలీఫ్ కోసం గేమ్స్ ఎంచుకొంది అని ఆమె టీమ్ చెప్తోంది.
సోషల్ మీడియాలో కూడా ఆమె తరుచుగా అలాంటి ఫోటోలను షేర్ చేస్తుంటుంది. ఈ ఆదివారం తన ఇంట్లో రిలాక్స్ అవుతూ ట్యాబులో గేమ్ ఆడుతున్న ఫోటోలని షేర్ చేసింది.
ఇంతకుముందు లాక్దౌన్ టైంలో పూజ వంటకాలకు సంబందించిన వీడియోస్ ఎక్కువగా పోస్ట్ చేసింది. ఇప్పుడు మళ్లీ షూటింగ్ లు షురూ కావడంతో వంట పని పక్కన పెట్టింది. షూటింగ్ లతో ఆమె బిజీబిజీగా మారింది.
పూజ హెగ్డే ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’, ‘మోస్ట్ ఎలిజిబుల్’ సినిమాలను పూర్తి చెయ్యాలి. ఈ చిత్రాల షూటింగులన్నీ చివరి దశకు చేరుకున్నాయి. ఆగస్టు నెలాఖరులోపు ఇవన్నీ పూర్తి అవుతాయి. ఆ తర్వాత విజయ్ ‘బీస్ట్’, సల్మాన్ ఖాన్ హిందీ మూవీ షూటింగ్స్ పై ఫోకస్ పెట్టాలి. అలాగే, మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమాలో కూడా పూజనే తీసుకొనే అవకాశం ఉంది.