పుష్పక విమానం ప్రేక్షకులతో ఇంటరాక్షన్

ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రం… ‘పుష్పక విమానం’. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా పేరు తెచ్చుకొంది. తాజాగా ఈ మూవీ టీం ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయ్యింది. హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్లు గీత్ సైని, శాన్వి మేఘన, దర్శకుడు దామోదర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని, నటుడు కిరీటి ప్రేక్షకులతో సరదాగా ముచ్చటించారు.

ఎక్కడా ఇబ్బంది పడకుండా ఫ్యామిలీతో కలిసి పుష్పక విమానం సినిమా చూసి ఎంజాయ్ చేశామని ఇంటరాక్షన్ లో పాల్గొన్న ప్రేక్షకులు చెప్పారు.

లాక్ డౌన్ తర్వాత ఆడియెన్స్ కు ఒక మంచి నవ్వించే సినిమా అందించాలనే “పుష్పక విమానం” సినిమా చేసినట్లు ఆనంద్ దేవరకొండ అన్నారు. తాము అనుకున్న పర్పస్ నెరవేరిందని, సినిమా హిట్ చేసినందుకు ఆడియెన్స్ కు థాంక్స్ చెప్పారు.

Advertisement
 

More

Related Stories