- Advertisement -

కరోనా సెకండ్వేవ్, లాక్డౌన్ కారణంగా అనేక పేద కుటుంబాలు నిత్యావసరాలకు ఇబ్బంది పడ్డాయి. దాంతో హీరో రానా దగ్గుబాటి తనవంతుగా 400 గిరిజన కుటుంబాలను సాయం చేశారు. నిర్మల్ జిల్లాలోని గిరిజన కుటుంబాలకు అవసరమైన కిరాణా సామాగ్రిని, వాటితో పాటు కొన్ని మందులు అందించారు.
సరుకులు అందుకున్న వారు రానాకి కృతజ్ఞతలు తెలిపారు.
రానా ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో కలిసి సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో ‘అయ్యప్పనుమ్ కోషియం’ తెలుగు రీమేక్లో నటిస్తున్నారు.