రంగమార్తాండ మళ్ళీ షురూ


రెండేళ్ల క్రితం ‘రంగమార్తాండ’ అనే సినిమాని షురూ చేశారు కృష్ణవంశీ. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఇప్పటివరకు పూర్తి కాలేదు. దాంతో, ‘రంగమార్తాండ’ ఆగిపోయింది అనే ప్రచారం కూడా జరిగింది. కానీ, ఆగిపోలేదని అంటున్నారు కృష్ణవంశీ. అంతేకాదు తాజాగా మళ్ళీ షూటింగ్ షురూ చేశారట.

తాజాగా మొదలు పెట్టిన షూటింగ్ లో ఒక పాటని తీస్తున్నారు. రాహుల్ సిప్లిగంజ్, శివాత్మికలపై డ్యూయెట్ ఇది.

ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన జంట. సింగర్ రాహుల్ సిప్లిగంజ్, యువ హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ యువ జంటగా కనిపిస్తారు. అనసూయ ఒక కీలక పాత్రలో నటిస్తోందని టాక్. మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు ఈ మూవీకి. గతంలో కృష్ణవంశీ, ఇళయరాజా కాంబినేషన్ లో వచ్చిన ‘అంతపురం’ పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ ఆల్బమ్ దానికి మించి ఉంటుందని అన్నట్లుగా చెప్తున్నారు కృష్ణవంశీ.

ఒకప్పుడు అద్భుతమైన సినిమాలు తీసి క్రియేటివ్ డైరెక్టర్ అనిపించుకున్నారు కృష్ణవంశీ. ఐతే, రీసెంట్ గా ఆయన కొన్ని ఎదురుదెబ్బలు చూశారు. దాంతో, ఆయన సినిమాల రాక తగ్గింది. ఈ ‘రంగమార్తాండ’తో మరోసారి కృష్ణవంశీ పుంజుకుంటారా అన్నది చూడాలి.

Advertisement
 

More

Related Stories