నేను ఆరోగ్యంగానే ఉన్నాను: రేణు

ఒకప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేవారు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు. కొంతకాలంగా ఆమె ఇన్ స్టాగ్రామ్ కి దూరం అయ్యారు. ఆమెకి హెల్త్ బాలేదన్న ప్రచారం జరిగింది. తాజాగా ఈ ప్రచారంపై ఆమె స్పందించారు.

“ఇన్ స్టాగ్రామ్ నుంచి లాంగ్ బ్రేక్ తీసుకున్నాను. నాకు ఏమీ కాలేదు. ఆరోగ్యంగానే ఉన్నాను. అన్ని విధాలా బాగున్నాను. నా క్షేమసమాచారం తెలుసుకునే ప్రయత్నం చేసిన మీ అందరికీ థాంక్స్,” అని కొత్త ఫోటోలను షేర్ చేశారు రేణు. ఆమె కొడుకు అకీరా, కూతురు ఆద్యతో హైదరాబాద్ లో ఉంటున్నారు.

ఆమె కూతురు ఆద్య కూడా ఈ ఫొటోల్లో ఉన్నారు. తల్లి తీసుకుంటున్న సెల్ఫీలో ఆద్య కూడా వచ్చి చేరింది.

గతంలో రేణు కొన్ని వివాదాస్పద కామెంట్స్ పోస్ట్ చేసేవారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెతో గొడవపడుతుండేవారు. ఇప్పుడు ఆ గోల తగ్గింది.

Advertisement
 

More

Related Stories