‘వ్యూహం’ దెబ్బతో మారిన ‘శపథం’

Ram Gopal Varma

రామ్ గోపాల్ వర్మ తీసిన “వ్యూహం” దారుణంగా పరాజయం పాలైంది. ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీకి ఉపయోగపడేలా తీశారు వర్మ. ఐతే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చూడలేదు. ఘోరమైన విమర్శలు వచ్చాయి. మొదటి ఆటకే టపా కట్టిన ఆ సినిమా ఫలితం చూసిన తర్వాత దానికి రెండో పార్ట్ గా తీసిన “శపథం” సినిమాని థియేటర్లో విడుదల చెయ్యడం లేదు.

ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ శుక్రవారం (మార్చి 8న) “శపథం” థియేటర్లలోకి రావాలి. కానీ “వ్యూహం” సినిమాని ఎవరూ చూడలేదు కాబట్టి దీన్ని ఎవరూ పట్టించుకుంటారు? అందుకే ఇప్పుడు ఈ సినిమాని వెబ్ సిరీస్ గా మార్చి ఓటిటిలో విడుదల చేస్తున్నట్లు వర్మ ప్రకటించారు.

“శపథం ఆరంభం చాప్టర్ 1ని ఈ రోజు సాయంత్రం ఎనిమిది గంటలకు, అలాగే శపథం అంతం చాప్టర్ 2 ని రేపు మార్చి 8న 8 pmకి ఆంధ్రప్రదేశ్ లోని AP ఫైబర్ నెట్లో OTT App ద్వారా పే ఫర్ వ్యూలో చూసుకోవటానికి అవకాశం కలిపిస్తున్నాం. ఆ తర్వాత అన్నిటిలో రిలీజ్ చేస్తాం,” అని వర్మ వెల్లడించారు.

అదన్నమాట సంగతి. వర్మ “వ్యూహం”, “శపథం” అంటూ ఇన్నాళ్లూ చాలా హంగామా చేశారు. కానీ ఇప్పుడు ఇలా నీరుగారిపోయారు.

 

More

Related Stories